Lalu Yadav : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు రోహిణి ఆచార్య, మిసా భారతితో కలిసి దేశ రాజధానిలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు లాలూ యాదవ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, భోగభాగ్యాలను తీసుకురావాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.
ప్రజల్లో సోదరభావం, ప్రేమ తత్వం పెంపొందాలని అన్నారు. మీ జీవితాలు రంగులమయం కావాలని, సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉపాధి, పురోగతి, సామరస్యంతో ప్రజలు సంతోషంగా ఉండాలని, హోలీ పర్వదినంతో ప్రజల జీవితాలు రంగులమయం కావాలని అన్నారు.
ఇక లాలూ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నాలోని తన నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ప్రేమ, సోదరభావం, సామరస్యంతో హోలీ వేడుకలను జరుపుకోవాలని కోరారు.
Read More :