ఛండీగఢ్: ఓ యువకుడు బైక్పై వెళ్తున్నాడు. ఒక్క సారిగా బైక్ ట్యాంక్ పేలింది. దీంతో బైక్పై ఉన్న అతడు తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్లోని జలాలాబాద్లో జరిగింది. ఫజికా జిల్లాలోని జలాలాబాద్కు చెందిన ఓ యువకుడు బుధవారం రాత్రి తన బైక్పై వెళ్తున్నాడు. మరో రెండు నిమిషాల్లో తన గమ్యస్థానికి చేరుకుంటాడు. ఇంతలో బైక్ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కాగా, అసలు బైక్లో ఎందుకు పేలుడు సంబంధించిందనే విషయం ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.