న్యూఢిల్లీ: సమయపాలనలో హైదరాబాద్లోని రాజీవ్గాంధీ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నట్టు వైమానిక విశ్లేషణ సంస్థ సర్క్యూమ్ వెల్లడించింది.
అమెరికా ఉటాలోని సాల్ట్ లేక్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలువగా, మిన్నెసోటాలోని మినియాపోలిస్-సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నాలుగో స్థానంలో, కొలంబియాలోని ఎల్ డొరాడో ఎయిర్పోర్టు ఐదో స్థానంలో నిలిచాయి.