శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన పౌరుల మృతదేహాలను వారి కుంటుబాలకు అప్పగించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీనగర్లోని గవర్నర్ హౌస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ క్షమాపణ చెప్పాలని, హైదర్పోరా ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ చేసి చంపిన పౌరుల మృతదేహాలను వారి కుటుంబాలకు ఇప్పటి వరకు అప్పగించకపోవడంపై ఆమె మండిపడ్డారు. వారి మృతదేహాలను అప్పగించడంతోపాటు బాధిత కుటుంబాలకు పరిహారం కూడా చెల్లించాలని ముఫ్తీ డిమాండ్ చేశారు.