ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో సుప్రీంకోర్టు బెయిల్ పొందిన నిందితుడు, రచయిత వరవరరావుకు ముంబైలోని ఎన్ఐఏ కోర్టు కొన్ని షరతులు విధించింది. ముం బైని విడిచివెళ్లవద్దని, తన అనుమతి లేనిదే ఎక్కడికి పోవద్దని ఆదేశించింది. ఈకేసులోని ఇతర నిందితులతో మాట్లాడవద్దని, ఇంటికి వచ్చే సందర్శకులతో సమావేశం కావొద్దని, అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకోవద్దని సూచించింది. కేసుకు సంబంధించిన విషయాలపై మీడియాతో మాట్లాడవద్దని కోరింది. బెయిల్ షరతులను సడలించాలన్న వరవరరావు పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ షరతులు విధించింది.