Wayanad | ప్రకృతి ప్రకోపంతో కేరళ తల్లడిల్లుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ (Wayanad) జిల్లా చివురుటాకులా వణుకుతోంది. వరద బీభత్సంతో జనం భీతిల్లగా, జిల్లాలోని మెప్పడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే నాలుగు సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో ఇప్పటి వరకూ 107 మంది మరణించగా.. 116 మంది గాయపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వందలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని సాయం కోసం అర్థిస్తున్నారు. ఇక ఈ విలయానికి ముందక్కాయి, చూరల్ మాలా (Chooralmala), అత్తమాల, నూల్పుజా గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక చూరల్ మాలా పట్టణం సగం తుడిచిపెట్టుకుపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. అక్కడ చలియార్ నదిలో చాలా మంది కొట్టుకుపోయారని పేర్కొంది.
#WATCH | Kerala: Rescue operation underway by Indian Air Force helicopters in the Chooralmala area of Wayanad where a landslide occurred earlier today claiming the lives of over 93 people. pic.twitter.com/FbaJRQd1eo
— ANI (@ANI) July 30, 2024
చూరల్ మాలాలో బ్రిడ్జ్ కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన కేరళ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఆర్మీ చూరల్ మాలాలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడిన వయనాద్లోని చూరల్ మాల ప్రాంతంలో ఐఏఎఫ్ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగడంతో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతమైంది. శిధిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను గుర్తించేందుకు శ్రమిస్తున్నారు.
Read More :
Jangaon | అయోధ్య సరయూ నదిలో జనగామ యువతి గల్లంతు..!