Ayodhya Ram Mandir | కోల్కతా: అయోధ్య రామాలయం నిర్మాణంలో మత సామరస్యం వెల్లివిరుస్తున్నది. శ్రీరాముని విగ్రహాల తయారీలో ముస్లిం శిల్పులు భాగస్వాములయ్యారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మహమ్మద్ జమాలుద్దీన్, బిట్టు (తండ్రీకొడుకులు) తయారు చేసిన అద్భుతమైన శ్రీరాముని విగ్రహాలను రామాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు.
వీరిద్దరి నైపుణ్యాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్న రామాలయం ట్రస్ట్ విగ్రహాల తయారీకి వీరికి ఆర్డర్ ఇచ్చింది. జమాలుద్దీన్ మాట్లాడుతూ, ఒక్కొక్క విగ్ర హం రూ.2.8 లక్షలు ఉంటుందని, అయితే వీటి తయారీలో పనితనం కూడా అదే స్థాయిలో ఉంటుందన్నారు. శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. తాను దుర్గా మాత, జగద్ధాత్రి విగ్రహాలను కూడా తయారు చేస్తానన్నారు.