న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి మసీదు పరిసరాల్లో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టు విచారణ చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆలయ శిథిలాలపై మసీదు నిర్మించారని.. ఈద్గా పరిసరాల్లో సర్వే చేపట్టి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతూ శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ దాఖలు చేసిన పిటిషన్ను జూలై 10న అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ తాజాగా ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.