హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ఎజెండా ఉందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండా ఉందని, రాహుల్ గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఎందుకంటే మహారాష్ట్రలో వాళ్లు అధికారంలో ఉన్నారని, ప్రాంతీయ పార్టీ సపోర్ట్తోనే అక్కడ వాళ్లు అధికారంలో ఉన్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారిందని, రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుందని, ప్రాంతీయ పార్టీలే సారథ్య బాధ్యతలు వహిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని.. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, మతపరమైన సహనం లోపించిందని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల విజయంపై కాంగ్రెస్ అసూయ వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు. మెరుగైన పాలన అందించాము కాబట్టే తాము సక్సెస్ అయినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరహాలో తమకు నాయకత్వ సంక్షోభం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
#WATCH Congress discussed reviving their party…Our country is reeling with unemployment & communal disharmony…They expressed anguish about success of regional parties. We're successful because we perform. (Un)like Congress, we don't have leadership crisis…:TRS MLC K Kavitha pic.twitter.com/ZJ6dS8lKQ6
— ANI (@ANI) May 18, 2022