న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫామ్స్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఇదే అంశంపై పెండింగ్లో ఉన్న పలు ఇతర పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ను ఏప్రిల్లో విచారిస్తామని తెలిపింది. పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీచేసింది.