Hyderabad | ముంబై, మార్చి 30: దేశంలోని 8 ప్రధాన నగరాలవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి-మార్చిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతంతో పోల్చితే 44 శాతం పెరిగినట్టు తేలింది. వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న కార్పొరేట్లు.. ఆఫీస్ స్పేస్ను అందిపుచ్చుకుంటున్నారని తమ తాజా నివేదికలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తెలియజేసింది.
ఈ క్రమంలోనే నిరుడు జనవరి-మార్చిలో 80.09 లక్షల చదరపు అడుగుల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్.. ఈ ఏడాది జనవరి-మార్చిలో 115.14 లక్షల చదరపు అడుగులకు ఎగిసిందని వివరించింది. గడిచిన ఐదేండ్లలో ఇది మూడో అత్యంత ఎక్కువ స్థాయి అని కూడా పేర్కొన్నది.
ఇదిలావుంటే బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై నగరాల్లో కార్యాలయ స్థలాలకు లీజింగ్ పెరుగగా.. పుణె, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్ల్లో తగ్గింది. క్రిందటిసారితో పోల్చితే హైదరాబాద్లో ఈసారి 2 శాతం పడిపోయి 16,05,953 లక్షల చదరపు అడుగులకు ఆఫీస్ స్పేస్ లీజింగ్ పరిమితమైంది. నిరుడు జనవరి-మార్చిలో 16,40,242 చదరపు అడుగులుగా ఉన్నది.