ముంబై : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. పెట్రోల్ ధరలు లీటర్కు రూ 50కి దిగివచ్చే వరకూ బీజేపీని పూర్తిగా ఓడించాలని రౌత్ ప్రజలను కోరారు. పెట్రోల్ ధరలు గత కొంతకాలంగా పైపైకి ఎగబాకుతూ రూ 110కి చేరి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.
పెట్రో భారాల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం పెట్రోల్పై రూ 5, డీజిల్పై లీటర్కు రూ 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే పెట్రోల్, డీజిల్పై కేంద్రం మరింతగా సుంకాలు తగ్గించాలని రాజస్దాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సహా పలువురు విపక్ష నేతలు కోరుతున్నారు.