Sukhdev Singh | జైపూర్ : రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ దారుణ హత్యకు గురయ్యారు. జైపూర్లోని తన నివాసంలో ఉన్న సుఖ్దేవ్ సింగ్పై ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సుఖ్దేవ్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
సుఖ్దేవ్ ఇద్దరు అనుచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుఖ్దేవ్ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుఖ్దేవ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాల్పులు జరిపిన వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.