Jamili Elections | రాయ్బరేలి : జమిలి ఎన్నికల నిర్వహణతో కేంద్రంలో అధికారమున్న పార్టీకి లబ్ధి చేకూరుతుందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒకవేళ ఇది అమలైతే, కేంద్రంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా.. అధికారంలో ఉన్న పార్టీకి లబ్ధి చేకూరుతుంది’ అని అన్నారు. ఈ విధానంలో ఏ రాజకీయ పార్టీ కూడా వివక్షకు గురికాదన్నారు.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్పై కేంద్రం 8 మంది నిపుణులతో ఏర్పాటుచేసిన అత్యున్నస్థాయి కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు చేస్తున్న వ్యయం తగ్గుతుందన్నారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.