లక్నో, అక్టోబర్ 27: ఆయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర నిర్మాణంలో రాముని ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.
ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ప్రముఖ వేద పండితుడు వారణాసి లక్ష్మీ కాంత్ దీక్షిత్ దీనిని నిర్వహిస్తారన్నారు.