న్యూఢిల్లీ, జూన్ 22 : ఆయోధ్య రామాలయం విరాళాల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, సీబీఐ విచారణ జరుపాలంటూ సుప్రీంకోర్టులో సోమవారం ఒక పిటిషన్ దాఖలైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవహారా లు, పరిపాలనకు సంబంధించి ఆర్థిక అవకతవకలు, ఇతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరుపాలని పిటిషన్ కోరింది.
మరోవైపు విరాళాలకు సంబంధించి జరిగిన అవకతవకలపై అత్యవసర విచారణ చేపట్టాలంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ను ఏర్పాటుచేసినందున, అత్యవసర విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది.