లక్నో : జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Temple Inauguration) ముందు రామ్లల్లా హారతి కోసం ఆన్లైన్ బుకింగ్ను ప్రారంభించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఒక రోజు ముందుగా ఆలయంలో శ్రీరామచంద్రమూర్తికి హారతి ఇస్తారు. ఈ హారతిలో పాల్గొనేందుకు పాస్లు పొందేందుకు భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
రామ జన్మభూమి ఆలయ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం అయోధ్య ఆలయ కౌంటర్లో పాస్లు అందుబాటులో ఉంటాయి. ఆధార్ కార్డ్, ఓటరు ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్గా అందించాల్సి ఉంటుంది.
విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు రోజు ఉదయం 6.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం 7.30 గంటలకు హారతి ఇస్తారు. ఉదయం శ్రింగార్ హారతి, మధ్యాహ్నం భోగ్ హారతి, సాయంత్రం సంధ్యా హారతి సమర్పించనుండగా ప్రతి హారతిలో గరిష్టంగా 30 మందిని అనుమతిస్తారు.
పదేండ్ల లోపు పిల్లలకు ప్రత్యేక పాస్ అవసరం లేదు.
హారతి బుకింగ్ టైమ్లో ఐడీ ప్రూఫ్ కాపీ తప్పనిసరి
భక్తులు హారతి బుకింగ్ను రద్దు చేసుకుంటే ఇతరులకు కేటాయింపు
హారతి పాస్ కౌంటర్లో భక్తులు తమ పాస్లను కలెక్ట్ చేసుకోవాలి
Read More :