Ayodhya Ram Mandir | అయోధ్య: 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు. కొన్ని రాష్ర్టా లు పూర్తిగా, మరికొన్ని మధ్యాహ్నం 2.30 వరకు సెలవిచ్చాయి. యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి పూర్తి సెలవు ప్రకటించగా, గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిశా సగం రోజు సెలవు ఇచ్చాయి.
ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ పాఠశాలలకు సెలవు ఇచ్చాయి. తమ సంస్థల ఉద్యోగులకు రిలయన్స్ సోమవారం సెలవు ప్రకటించింది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని సోమవారం స్టాక్ మార్కెట్లు తెరుచుకోవు. దానికి బదులుగా సెలవుదినమైన శనివారం స్టాక్మార్కెట్లు పనిచేశాయి.