న్యూఢిల్లీ: అయోధ్యలో కొలువు దీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ త్వరలో వీటిని విడుదల చేయనుంది. ఇవి ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లోనూ లభ్యం కానున్నాయి.
అయితే దీనిపై బులియన్ మార్కెట్ వ్యాపారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బాలక్రామ్ చిత్రాలతో వెండి నాణేలను విక్రయిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలరాముడికి సంబంధించిన మూడు సావనీర్ నాణేలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది.