లక్నో : శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ గురువారం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన త్రీడీ (3D) వీడియోను విడుదల చేసింది. వీడియోలో భారతీయ అధ్యాత్మిక పురుషుడి ఆలయ నిర్మాణం మంత్రముగ్ధులను చేస్తున్నది. శంకుస్థాపన తర్వాత ప్రారంభమైన భవన నిర్మాణానికి సంబంధించి వివిధ దశల్లో జరిగే పనులను త్రీడీలో అత్యత్భుతంగా చిత్రీకరించారు.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆగస్ట్ 5న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా, ట్రస్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో ఆలయం పునాది పనుల నుంచి స్తంభాలు, పైకప్పు, ఆలయం వెలుపలి భాగాలు చిత్రీకరించగా.. శిల్పకళా వైభవం ఆకట్టుకుంటున్నది. ఇదిలా ఉండగా.. ఆలయాన్ని వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసి, ఆలయాన్ని ప్రారంభించాలనికి శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ భావిస్తున్నది.