న్యూఢిల్లీ, మే 29 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజును సోమవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్లో బీసీల అభివృద్ధికి నిధులు రెండు లక్షల కోట్లకు పెంచాలని కోరారు. కేంద్రప్రభుత్వం దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు 2 వేల కోట్లు కేటాయించి అవమానించిందని ఆరోపించారు.