న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్కు సంబంధించి ఇంకా రభస కొనసాగుతూనే ఉన్నది. ఆ 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇవాళ కూడా రాజ్యసభ ( Rajya Sabha ) ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొన్నది. విపక్షాలకు నచ్చజెప్పి సభను కొనసాగించేందుకు సభాపతి ప్రయత్నించినా కుదరలేదు. దాంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా 12 మంది విపక్ష ఎంపీలు సభా నియమావళిని ఉల్లంఘించారంటూ శీతాకాల సమావేశాల మొదటి రోజే వారిపై సస్పెన్షన్ విధించారు. వారిలో ఐదుగురు కాంగ్రెస్ సభ్యులు, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు, మరో ఇద్దరు శివసేన సభ్యులు ఉన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సస్పెండయ్యారు. వారంతా ఆ రోజు నుంచి పార్లమెంటు ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.