న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో సైనికుల ప్రాణత్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదని, భారత్ను బెదిరించేందుక ప్రయత్నించే వారిని సహించదని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పరోక్షంగా చైనాను హెచ్చరించారు. లడఖ్లో సోమవారం రెండవ రోజు పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్ మొగ్గుచూపినా విదేశీ శక్తుల బెదిరింపులను సహిందని స్పష్టం చేశారు.
తమకు ఎదురయ్యే ప్రతి సవాల్కూ దీటుగా బదులిచ్చే సామర్ధ్యం భారత్కు ఉందని అన్నారు. అంతకుముందు రాజ్నాధ్ సింగ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) చేపట్టిన 63 మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలను అనుసంధానించడంలో బీఆర్వో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.