అహ్మదాబాద్ : రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ను బలోపేతం చేయడంతో పాటు రక్షణ రంగ ఎగుమతులను ప్రోత్సహిస్తామని అన్నారు. డిఫెన్స్ ఎక్స్పో 2022 నిర్వహణపై గుజరాత్ ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య గుజరాత్లోని కేవడియ వద్ద రక్షణ మంత్రి రాజ్నాధ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.
గుజరాత్లోని గాంధీనగర్లో వచ్చే ఏడాది మార్చి 11-13 తేదీల్లో డిఫెన్స్ ఎక్స్పో జరగనుంది. గ ఏడాది డిఫెన్స ఎక్స్పోలో 70 దేశాలు పాల్గొనగా వచ్చే ఏడాది ఈ ప్రదర్శనలో 100 వరకూ దేశాలు పాలుపంచుకుంటాయని ఆశిస్తున్నామని మంత్రి రాజ్నాధ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. డిఫెన్స్ ఎక్స్పో2022 భారత్ను మిలటరీ హార్డ్వేర్ తయారీ హబ్గా ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు చర్యలు చేపట్టేలా రక్షణ మంత్రిత్వ శాఖ సన్నాహలు చేస్తోంది.