Rajnath Singh : లోక్సభ ఎన్నికల వేళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) త్వరలోనే భారతదేశంలో విలీనమవుతుందని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా లఢఖ్లోని లేహ్ సైనిక స్థావరాన్ని రాజ్నాథ్ సందర్శించారు. అక్కడ మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత జవాన్లతో కలిసి రాజ్నాథ్ సింగ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పీవోకే భారత్లో విలీనమవుతుందని, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు భారత్లో తమ ప్రాంతాన్ని విలీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. త్వరలోనే భారత్లో పీవోకే విలీనమవుతందనే విశ్వాసం తనకు వంద శాతం ఉందని చెప్పారు. ఢిల్లీ దేశానికి రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని కాగా, లఢఖ్ మన దేశ శౌర్యానికి రాజధాని అవుతుందని రక్షణ మంత్రి అభివర్ణించారు.