Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలు క్లైమాక్స్కు చేరుకున్న దశలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలో అసహనం పెరిగిపోతోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో పరిధులు దాటి రాహుల్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మతం, కులం, వర్గం ఆధారంగా ప్రజలను విభజించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో సైన్యాన్ని, సాయుధ బలగాలనూ తన విభజన రాజకీయాల్లో వాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సాయుధ బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతినేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఈసీ ఇటీవల పార్టీలను హెచ్చరించినా రాహుల్ వినిపించుకోలేదని దుయ్యబట్టారు. రాజ్యాంగ వ్యవస్ధల పట్ల రాహుల్కు ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించారు. జూన్ 4న రాహుల్కు దేశ ప్రజలు స్పష్టమైన సమాధానం ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు.
Read More :
Police Jeep: హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం.. వీడియో