జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) స్పీకర్, కాంగ్రెస్ నేత సీపీ జోషీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీపీ జోషీ నధ్వారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి విశ్వరాజ్ సింగ్ మెవర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
తమ హయాంలో జరిగిన అభివృద్ధిని మెవర్ రాబోయే ఐదేండ్లలో కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నానని బీజేపీ అభ్యర్ధికి జోషీ తన అభినందనలు తెలియచేశారు. నియోజకవర్గ ప్రజల నిర్ణయాన్ని తాను అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
నధ్వారా నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి తాను నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. ఇక రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ కేవలం 64 సీట్లకు పరిమితం కానుంది.
Read More :
Assembly Election | మూడు రాష్ట్రాల్లో కమలం హవా.. సంబరాల్లో బీజేపీ శ్రేణులు