జైపూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. మద్యానికి బానిసైన కొడుకు.. మందుకు డబ్బు ఇవ్వడం లేదని తండ్రిపై దాడిచేశాడు. జోధ్పూర్కు చెందిన రాజేంద్ర గౌర్ కజ్రీ టెక్నీషియన్ పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చిన్న కొడుకు మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవచేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో డబ్బు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఆదివారం వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో కోపంతో ఊగిపోయిన సుపుత్రుడు.. ఇంట్లోని సమాన్లను వీధిలో పడేశాడు. అంతటితో ఆగకుండా తండ్రిపై దాడిచేశాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయి. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | A video of a son beating his father in Rajasthan's Jodhpur went viral
The son often quarrels with the father regarding matters of the household. He misbehaved with his father yesterday also. He has been arrested under CrPC 151: SHO Ratnada PS
(CCTV Visuals) pic.twitter.com/3RScDVlOi4
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022
మంగళవారం కూడా మద్యం డబ్బుకోసం అతడు తండ్రితో గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. మద్యం కోసం 70 తండ్రిని అతని కొడుకు విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో అతడు మృతిచెందాడు.