జైపూర్ : ధరల మంటతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై సుంకాలను మరింత తగ్గించాలని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గిస్తే రాష్ట్రాలు విధించే వ్యాట్ దిగివస్తుందని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ సుంకం మరింత తగ్గించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో గెహ్లోత్ కేంద్రాన్ని కోరారు.
కేంద్రం పెట్రోల్పై రూ 5, డీజిల్పై రూ 10 ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో రాజస్థాన్లో పెట్రోల్పై వ్యాట్ రూ 1.8, డీజిల్పై రూ 2.6 తగ్గిందని సీఎం ప్రస్తావించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ 6.8 రూ 2.6 చొప్పున దిగివచ్చాయని చెప్పారు. తగ్గించిన రేట్లను వినియోగదారులకు పెట్రోల్ దుకాణాలు తక్షణమే అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నష్టాలు భరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు.