Loksabha Elections 2024 | కాంగ్రెస్ పార్టీకి పేదల మేలు పట్టదని రాజస్ధాన్ సీఎం భజన్లాల్ శర్మ ఆరోపించారు. కాంగ్రెస్ మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో ఆ పార్టీ ప్రజలకు దూరమైందని అన్నారు.
ప్రజల్లో పట్టు కోల్పోవడంతో దిక్కుతోచని కాంగ్రెస్ చిన్నాచితకా పార్టీలతో పొత్తులకు మొగ్గుచూపిందని దుయ్యబట్టారు. ప్రజల బాగోగులు విస్మరించినందునే ఆ పార్టీకి ఈ దుస్ధితి దాపురించిందని అన్నారు. గుజరాత్లోని బనస్కాంతలో మంగళవారం జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి భజన్లాల్ శర్మ ప్రసంగించారు.
గరీబీ హఠావో నినాదంతో ప్రజల ముందుకు వచ్చే కాంగ్రెస్ వాస్తవానికి పేద ప్రజల కోసం పనిచేయదని ఆరోపించారు. రైతుల గురించి, వారి బాగు కోసం పెద్దమాటలు చెప్పే కాంగ్రెస్ రైతుల సమస్యలను విస్మరిస్తుందని అన్నారు.
Read More :
Swimming pool | సనత్నగర్లో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి