న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణం చల్లబడింది. నగరంలో సోమవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం (Rainfall) కురిసింది. సోనిపట్, రోహ్తక్, ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఇందిరాపురం, జింద్, గొహనా ప్రాంతాలతో సహా ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం కురిసింది. దేశ రాజధానిలో ఆదివారం రికార్డు స్థాయిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కబోతతో ఇబ్బందిపడ్డారు.
అయితే ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాగా, వచ్చే మూడు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. హర్యానాతోపాటు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో మోస్తారు వానలు కురుస్తాయని వెల్లడించింది. అయితే ఈదురు గాలులకు నగరంలో అక్కడకక్కడ రోడ్లపై చెట్లు ఇరిగి పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
#WATCH | Rain lashes parts of Delhi, visuals from Vijay Chowk. pic.twitter.com/Hh7q3LikQ6
— ANI (@ANI) May 28, 2023
#WATCH | Rain lashes parts of the national capital. Visuals from Connaught Place. pic.twitter.com/W71CiwjIch
— ANI (@ANI) May 28, 2023
#WATCH | Delhi weather change: Rain lashes parts of city, visuals from Sansad Marg pic.twitter.com/R20GUYp9dW
— ANI (@ANI) May 28, 2023
Sonipat, Rohtak, Kharkhoda (Haryana) Bagpat, Khekra, Modinagar, Gabhana (U.P.) during next 2 hours. pic.twitter.com/oypJupz4Dt
— RWFC New Delhi (@RWFC_ND) May 28, 2023