హైదరాబాద్ : యాస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 30– 40 కిలో మీట ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నది పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో బుధవారం ఎండలు దంచి కొట్టాయి. ములుగు, భూపాలపల్లి, భద్రాద్రికొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 43 డిగ్రీలపైన నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపూర్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జీహెచ్ఎంసీలోని నారాయణగూడలో అత్యధికంగా 39.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుగూడెంలో 20.6, జీహెచ్ఎంసీలోని బీహెచ్ఈఎల్లో 25.5 డిగ్రీలుగా నయోదయ్యాయి.