చందంపేట, మే 26: నల్లమల అటవీప్రాంతం అరుదైన జంతు, పక్షులకు నిలయం గా మారుతున్నది. తాజాగా అడవిలో పుట్టి ఎలుగు (హనీ బడ్గర్), మరో సరికొత్త పక్షి కెమెరా ట్రాప్కు చిక్కినట్టు కంబాలపల్లి అటవీశాఖ అధికారి రాజేందర్ బుధవారం తెలిపారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంకంబాలపల్లి గ్రామ సమీపంలో దేవదారి వంక, మంగళితండా, అంగడి బండ అటవీప్రాంతాల్లో నీటి తొట్ల వద్ద ఏర్పాటుచేసిన కెమెరాల్లో రెండు పుట్టి ఎలుగులు, ఓ పక్షి సంచరిస్తూ కనిపించినట్టు చెప్పారు. ఇవి నల్లమలలో కనిపించడం తొలిసారని చెప్పారు. పుట్టి ఎలుగు రాత్రిళ్లు సంచరిస్తూ పురుగులు, కప్పలు, బల్లులు, పాములు, ఎలుకలు వంటి వాటిని వేటాడటంతోపాటు తేనె తుట్టెను తింటుందన్నారు.నీటి సమూహం, లోయల సమీప ప్రాంతాల్లో ఓ అరుదైన పక్షి సంచరిస్తున్నదని ఈ రకం పక్షి.. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వాయర్లో ఉన్నట్టు సమాచారం ఉన్నదని ఎఫ్డీవో సర్వేశ్వర్ తెలిపారు.