హాంకాంగ్, మే 26: పర్పుల్-పింక్ డైమండ్ ‘సాకురా’ వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.213 కోట్లు పలికింది. ఇప్పటి వరకు వేలం వేసిన ఈ రకం వజ్రాలతో పోలిస్తే ఈ ధరే అత్యధికం. క్రిస్టీస్ హాంకాంగ్ అనే నగల సంస్థ ఈ వజ్రాన్ని వేలం వేసింది. దీని బరువు 15.81 క్యారెట్లు. ఆసియాకు చెందిన ఓ వ్యక్తి వజ్రాన్ని కొనుగోలు చేసినట్టు సంస్థ తెలిపింది. అయితే ఆయన వివరాలను మాత్రం వెల్లడించలేదు.