ముంబై : టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు సరికొత్త విధానంతో ట్రైన్ టికెట్ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. దీని సాయంతో రైల్వే స్టేషన్కు 20 మీటర్ల దూరంలో ఉండి టికెట్ బుక్ చేసుకోవచ్చు.
అయితే జియో-ఫెన్సింగ్తో సంబంధం లేకుండా స్టేషన్ల పేర్లు, క్యూఆర్ కోడ్స్లను ఓ వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో కొంతమంది రైల్లో ఉంటూనే తనిఖీల సమయంలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ మోసాన్ని పశ్చిమ రైల్వే గుర్తించింది.