న్యూఢిల్లీ: వందే భారత్ రైలు ప్రయాణికుడి ఆహార ఫిర్యాదుపై రైల్వే స్పందించింది. సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. (Railways Fines IRCTC) క్యాటరింగ్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు చర్యలు చేపట్టింది. మార్చి 15న పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అందించిన ఆహారం నాణ్యతపై ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై రైల్వే సీరియస్గా స్పందించింది. సొంత సంస్థ ఐఆర్సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్కు రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత తమ ప్రధాన ప్రాధాన్యతలు అని రైల్వే అధికారి తెలిపారు.
కాగా, రైళ్లలో ఏటా సుమారు 58 కోట్ల భోజనాలను రైల్వే అందిస్తున్నది. అయితే ఆహార నాణ్యత, అధిక ఛార్జీలకు సంబంధించిన ఫిర్యాదులు సగటున 0.0008 శాతం మాత్రమే ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఫిర్యాదులపై విచారణ తర్వాత గత మూడేళ్లలో రూ.2.6 కోట్ల మేర జరిమానాలు విధించినట్లు పేర్కొంది.
మరోవైపు రైలు ప్రయాణికులపై పాంట్రీ కార్ సిబ్బంది దాడి చేసినట్లుగా 2025లో 3 సంఘటనలు నమోదైనట్లు రైల్వే తెలిపింది. ప్రభుత్వ రైల్వే పోలీసులు ఆ పాంట్రీ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read:
Ex-MLA’s Son Charred Body Found | కారులో మాజీ ఎమ్మెల్యే కుమారుడి కాలిన మృతదేహం.. హత్యగా అనుమానం
Kotak Mahindra Fraud | హర్యానాలో ఐడీఎఫ్సీ తర్వాత.. కోటక్ మహీంద్రా బ్యాంకులో రూ.160 కోట్ల మోసం