న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రైళ్ల కొత్త టైం టేబుల్ను రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసింది. ఇందులో 64 వందే భారత్ రైళ్లతోపాటు మరో 70 ఇతర రైల్వే సర్వీసులను చేర్చారు. ‘ట్రైన్స్ ఎట్ గ్లాన్స్(టీఏజీ)’ పేరుతో విడుదల చేసిన ఈ రైల్వే కొత్త టైమ్ టేబుల్ ఈ నెల 1 నుంచే అమలవుతున్నది.
ప్రయాణికులు కొత్త డిపార్చర్, అరైవల్ సమయాలను చెక్ చేసుకోవాలని సూచించింది. 90 రైళ్ల సర్వీసుల గమ్యస్థానాలను పెంచగా, 22 రైళ్ల వేగాన్ని పెంచి సూపర్ఫాస్ట్ క్యాటగిరీలోకి మార్చారు.