దివ్యాంగులు.. బస్సులు, రైల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అవస్థలు పడుతుంటారు. తోడు కచ్చితంగా ఒకరుండాలి. అయితే, రైలెక్కేందుకు తన అమ్మమ్మతో వచ్చిన ఓ దివ్యాంగుడు అవస్థలుపడుతున్నాడు. ఇది గమనించిన ఓ పోలీసు, అతడికి సాయం చేసి మానవత్వం చాటుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా విరుధాచలంలో జరిగింది. కడలూరు జిల్లా వృద్ధాచలంలోని శ్రీ కీరనూర్ నివాసి శివకుమార్ దివ్యాంగుడు. తన అమ్మమ్మతో కలిసి వైద్యం కోసం వృద్ధాచలం నుంచి కేరళలోని వడకరకు వెళ్తున్నాడు. శివకుమార్ను మోయలేకపోతున్న అతడి అమ్మమ్మను చూసి రైల్వే ఎస్ఐ ఎం.శరవణన్ పరుగున వచ్చాడు. శివకుమార్ను వీల్చైర్లో నుంచి లేపి రైలు బోగీలోకి ఎక్కించాడు. కంపార్ట్మెంట్లోని బెడ్పై పడుకోబెట్టాడు.ఈ క్లిప్ను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేయగా, వైరల్గా మారింది.
Wonderful gesture by Mr. Saravanan, SI,RPF. He carried a passenger with special needs and helped him to board a train at Virudhachalam station. We need more people like him. Video- by @RailMinIndia pic.twitter.com/mYSjRVfFdh
— Supriya Sahu IAS (@supriyasahuias) September 9, 2022