Union Budget 2022 | కేంద్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బడ్జెట్పై చాలామంది విపక్ష నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు స్పందిస్తున్నారు. తాజాగా కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మోదీ గవర్నమెంట్ జీరో బడ్జెట్ ఇది అంటూ ట్వీట్ చేశారు. ఇంగ్లీష్లో ట్వీట్ చేసి.. ఓ అక్షరం వచ్చే ప్లేస్లో సున్నాను టైప్ చేశారు. అల్టిమేట్గా ఇది సున్నా బడ్జెట్ అని.. ఉద్యోగులకు, మధ్య తరగతి ప్రజలకు, పేదవాళ్లకు, యూత్, రైతులు, ఎంఎస్ఎంఈకి ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
M0di G0vernment’s Zer0 Sum Budget!
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2022
Nothing for
– Salaried class
– Middle class
– The poor & deprived
– Youth
– Farmers
– MSMEs