భోపాల్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం మో ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ను నడుపుతూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. రాహుల్ బుల్లెట్ నడుపుతుండగా పార్టీ శ్రేణులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడ మూగిన ప్రజలను రాహుల్కు దారిఇచ్చేలా పక్కకు జరుపుతూ కనిపించారు.
#WATCH | Congress MP Rahul Gandhi rides a motorbike during the 'Bharat Jodo Yatra' in Mhow, Madhya Pradesh. pic.twitter.com/TNG1yvwKbo
— ANI (@ANI) November 27, 2022
రాహుల్ యాత్ర మోర్తక గ్రామం నుంచి శనివారం పున:ప్రారంభమైంది. ఇక మధ్యప్రదేశ్లో నాలుగో రోజు యాత్రలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కిందపడిపోయారు. టీ విరామం కోసం పాదయాత్ర నిలిచిన సమయంలో తొక్కిసలాట జరిగింది.
సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటి వరకూ ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్ చేరుకుంది. కన్యాకుమారి నుంచి చేపట్టిన రాహుల్ గాంధీ పాదయాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగుతూ కశ్మీర్లో ముగియనుంది. పాదయాత్ర సందర్భంగా మోదీ సర్కార్ లోపభూయిష్ట విధానాలను, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు.