Rahul Gandhi | వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) అసలైన ప్రజా నాయకుడు అని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) 75వ జయంతి (75th birth anniversary) సందర్భంగా రాహుల్ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ప్రజానీకానికి ఆయన నిజమైన నాయకుడు. ఎప్పుడూ ప్రజల కోసమే బతికిన నేత. ఏపీ, భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత ఎంతో మందికి మార్గదర్శకం. ఆయన ఇప్పుడు బతికే ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేది. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశాను’ అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్ జోడో యాత్రకు రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి అని ఈ సందర్భంగా రాహుల్ పేర్కొన్నారు. నాడు రాజశేఖర్రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
My humble tributes to former Chief Minister of Andhra Pradesh, YS Rajasekhara Reddy ji, on his 75th birth anniversary.
A true leader of the masses, his grit, dedication, and commitment to the upliftment and empowerment of the people of Andhra Pradesh and India has been a guiding… pic.twitter.com/iuGVsmsW8g
— Rahul Gandhi (@RahulGandhi) July 8, 2024
Also Read..
PM Modi | మోదీ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యతో ఉన్నాయి.. రష్యా వ్యాఖ్యలు
Rath Yatra | భక్తులతో కిక్కిరిసిన పూరి క్షేత్రం.. రెండో రోజు ప్రారంభమైన రథయాత్ర
Children Injured | అదుపు తప్పి బోల్తాపడిన బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు