Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్లో జోరుగా సాగుతోంది. రాహుల్ యాత్ర శుక్రవారం ససారం చేరుకోగా బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ యాత్రలో పాల్గొన్నారు. జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ వాహనాన్ని తేజస్వి యాదవ్ కొద్దిసేపు నడిపారు. ఓ వీడియోలో రాహుల్, తేజస్వి యాదవ్ ఎస్యూవీ పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండటం కనిపించింది.
ససారంలో జరిగిన సభలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బిహార్ సీఎం నితీష్ కుమార్పై విమర్శలు గుప్పించారు. నితీష్ ఎవరు ఏం చెప్పినా వినే పరిస్ధితిలో లేరని దుయ్యబట్టారు. తాను మరణించినా బీజేపీలో చేరనని నితీష్ కుమార్ చెప్పారని, 2024లో బీజేపీని మట్టికరిపించేందుకు తాము ఎన్ని త్యాగాలైనా చేసేందుకు సిద్ధమై నితీష్తో కలిసి సాగాలని అనుకున్నామని అన్నారు.
బీజేపీని నిలువరించేందుకు తామింత చేసినా నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీయేకు చేరువయ్యారని ఎద్దేవా చేశారు. రాహుల్ యాత్ర ఈరోజు సాయంత్రం బిహార్ నుంచి యూపీలో అడుగుపెట్టనుంది. ఇక జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది.
Read More :
Auto Bandh | నేడు ఆటో బంద్.. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్