న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్ పరీక్షలో ఆయన పాజిటివ్గా తేలారు. స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు రాహుల్ తన ట్విట్టర్లో తెలిపారు. అయితే కోవిడ్ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్గా వచ్చినట్లు చెప్పారు. తనతో ఇటీవల కాంటాక్ట్లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని రాహుల్ కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్లో జరగాల్సిన చివరి మూడు దశల ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
After experiencing mild symptoms, I’ve just tested positive for COVID.
— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2021
All those who’ve been in contact with me recently, please follow all safety protocols and stay safe.
రాహుల్ గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ట్విట్టర్లో రియాక్ట్ అయిన మోదీ.. లోక్సభ ఎంపీ రాహుల్ గాంధీజీ ఆరోగ్యం క్షేమంగా ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
I pray for the good health and quick recovery of Lok Sabha MP Shri @RahulGandhi Ji.
— Narendra Modi (@narendramodi) April 20, 2021