న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి చురకలు వేశారు. గతంలో ఒలింపియన్లకు హర్యానా ప్రభుత్వం గుప్పించిన హామీలను ఇంకా నెరవేర్చలేదనే కధనాల స్క్రీన్ షాట్లను ఇన్స్టాగ్రాంలో రాహుల్ పోస్ట్ చేశారు.
గతంలో టోక్యో ఒలింపిక్స్లో పతకాలు గెలుపొందిన నీరజ్ చోప్రా, భజరంగ్ పునియాలు తమకు హామీ ఇచ్చిన రివార్డుల హామీలను నెరవేర్చాలని మంత్రులు, అధికారులను కోరుతూ 2109లో చేసిన ట్వీట్ల స్క్రీన్షాట్లను కూడా రాహుల్ అటాచ్ చేశారు. క్రీడాకారులను అభినందించడంతో పాటు వారికి దక్కాల్సినవి అందించాల్సిన అవసరం ఉందని, క్రీడా బడ్జెట్లో కోతలు పెట్టడం సరికాదని రాహుల్ ఇన్స్టాగ్రాం పోస్ట్లో రాసుకొచ్చారు.