Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం యువతను తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యువతరం జై శ్రీరాం అని మాత్రమే నినాదాలు చేయాలని ఆపై ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.
మధ్యప్రదేశ్లోని షాజపూర్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ లక్ష్యంగా రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కుల గణన చేపడితేనే ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ విధానం అదేనని, సామాజిక న్యాయం దిశగా విప్లవాత్మక చర్యగా కుల గణన చేపట్టి తీరుతామని అన్నారు.
స్వాతంత్రోద్యమం, హరిత విప్లవం, డిజిటల్ విప్లవం ఏదైనా విప్లవాత్మక కార్యక్రమాలు కాంగ్రెస్తోనే సాధ్యమని రాహుల్ పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మన యువత వారి ఫోన్లకు అతుక్కుపోయి జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఆకలితో మరణించాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
READ More :
WPL 2024 | ‘మసాలా చాయ్’పై మనసుపడ్డ హిట్టర్.. రోజుకు అన్ని కప్పులా..?