న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ను టార్గెట్గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన నేపధ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో ప్రధాని మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మరోవైపు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆర్జేడీ, డీఎంకే, వామపక్షాలు సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించాయి.