Rahul Gandhi : బీజేపీ, ఆరెస్సెస్ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఛత్తీస్ఘఢ్లోని రాయ్ఘఢ్లో ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు దేశంలో మతాలు, భాషలు, రాష్ట్రాలు ఒకదానితో ఒకటి తలపడేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
విద్వేషాన్ని ప్రేమతోనే భగ్నం చేయవచ్చని అన్నారు. మీరు తమిళం, బెంగాలీ, ఉర్ధూ మాట్లాడితే మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించాలి..మీరు కశ్మీర్కు చెందిన వారు కావడంతో మీరంటే మాకు ఇష్టం లేదనే వైఖరి ప్రబలుతోందని ఇలాంటి తీరు దేశాన్ని బలహీనపరుస్తుందని రాహుల్ అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ ఈ తరహా విద్వేషాన్ని విరజిమ్ముతున్నాయని ఆరోపించారు. ప్రేమతో కూడిన దేశాన్ని రాబోయే తరానికి అందించే ఉద్దేశంతోనే తన యాత్ర ముందుకు సాగుతుందని చెప్పారు. జనవరి 14న మణిపూర్లో ప్రారంభమైన రాహుల్ యాత్ర 67 రోజులు 110 జిల్లాల్లోని వంద లోక్సభ నియోజకవర్గాల మీదుగా సాగుతూ మార్చి 20న ముంబైలో ముగుస్తుంది.
Read More :