న్యూఢిల్లీ : బీజేపీలో గులాంగిరీ నడుస్తుందని గతంలో కాంగ్రెస్లో ఉన్న కాషాయ పార్టీ ఎంపీ తనతో చెప్పారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఆ ఎంపీ హృదయం ఇప్పటికీ కాంగ్రెస్తోనే ఉందని రాహుల్ పేర్కొన్నారు. నాగ్పూర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ అగ్ర నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలు పాటించాలని, కార్యకర్తల గోడును వినే వారుండరని ఆ ఎంపీ తనతో చెప్పారని తెలిపారు.
పార్టీ హైకమాండ్ సూచనలు తమకు నచ్చినా నచ్చకపోయినా మరో అవకాశం ఉండదని, బీజేపీలో అలాగే ఉంటుందని ఆ ఎంపీ తనను ప్రైవేట్గా కలిసిన సందర్భంలో చెప్పారని రాహుల్ వె్లలడించారు. ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్ధలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లతో పనిచేస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్ధాపక దినం సందర్భంగా గురువారం మహారాష్ట్రలోని నాగపూర్లో భారీ ర్యాలీతో రానున్న లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు.
Read More :