అమరావతి : పార్టీలో తన పాత్ర ఏంటన్నదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే నిర్ణయిస్తారని ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విషయం సాధించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నది.
కార్యక్రమం 42వ రోజుకు చేరగా.. బుధవారం కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికలు, శశిథరూర్ వర్గం ఆరోపణలు, పార్టీలో తనపై ఏంటన్న విషయంపై స్పందించారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ మాత్రమే (పార్టీ అధ్యక్ష పదవికి) ఎన్నికలు నిర్వహించిందన్నారు.
ఎన్నికల సంఘం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఎన్నికల సంఘం ఎదుట ఉంచుతామని, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయా? లేదా? అన్నదానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్లో పార్టీ అధ్యక్షుడి పాత్రపై తాను ఏమీ చెప్పలేనన్నారు. తన పాత్ర ఎలా ఉంటుందనేది కొత్త అధ్యక్షుడే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.