న్యూఢిల్లీ : ‘మోదీ ఇంటి పేరు’ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఉన్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. మోదీ ఇంటి పేరును రాహుల్గాంధీ దూషించారంటూ ఆయనపై కేసు నమోదవగా గుజరాత్లోని ఓ స్థానిక కోర్టు రెండేండ్ల శిక్ష విధించింది. దీంతో రాహుల్గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. శిక్షపై స్టే ఇవ్వాలన్న ఆయన వినతిని జూలై 7న గుజరాత్ హైకోర్టు కొట్టేసింది.